వైఎస్ఆర్టీపీలో చేరి నా గొంతు నేను కోసుకోలేను !

Telugu Lo Computer
0


మొహమాటానికి వైఎస్ఆర్టీపీలో చేరితే తన గొంతు తానే  కోసుకోనట్లు అవుతుందని  పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పార్టీలో చేరడం లేదని షర్మిలకు కోపం ఉండొచ్చని, కానీ తాను ఏ లక్ష్యంతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానో అలాంటి లక్ష్యం ఉన్న పార్టీలో చేరుతానని తెలిపారు. దీనితో ఆయన షర్మిల పార్టీలో చేరరని క్లారిటీ రాగా, కాంగ్రెస్ గూటికి వెళ్తారా లేక కమలం పార్టీలో చేరి పంథాన్ని నెగ్గించుకుంటారా అనేది వేచి చూడాలి. గతంలో పొంగులేటి మొదట బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. అమిత్ షాతో భేటీ అయిన తరువాత దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ 2 నెలలు గడిచినా ఆయన బీజేపీలో చేరికపై క్లారిటీ రాలేదు. ఆ తరువాత ఆయన వైఎస్ విజయమ్మను కలవడంతో షర్మిల పార్టీలో చేరతారని అంతా భావించారు. ఎందుకంటే గతంలో పొంగులేటి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. దీనితో వైఎస్సార్ కూతురు షర్మిల పార్టీలో పొంగులేటి చేరిక ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజా వ్యాఖ్యలతో ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే ఆయనతో పాటు సస్పెండ్ అయిన జూపల్లి బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఇటు పొంగులేటిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 



Post a Comment

0Comments

Post a Comment (0)