కొటియా గ్రామాలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొటియా గ్రామాలు ఒడిశావే అంటూ పేర్కొన్నారు. ఏపీ పోలీస్ గో బ్యాక్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాదాస్పద కొటియా గ్రామాలపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో ఉండి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదంపై కేంద్రమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అవివేకం అనిపించుకుంటుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ దేశానికి మంత్రని, అన్ని ప్రాంతాలను సమ దృష్టితో చూడాలన్నారు. కేవలం ఒడిశాపై ప్రేమ చూపిస్తూ, ఏపీ పోలీస్ గో బ్యాక్ అనడం విచారకరమన్నారు. వెంటనే కేంద్రమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం
April 02, 2023
0
Tags