సావర్కర్‌ను అవమానించినందుకు రాహుల్ గాంధీని దేశం ఎప్పటికీ క్షమించదు !

Telugu Lo Computer
0


ఇటీవల అనంతరం కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ 'నా పేరు సావర్కర్‌ కాదు. క్షమాపణలు చెప్పను' అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. రాహుల్‌ పది జన్మలెత్తినా సావర్కర్‌ లా మారలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ  'సావర్కర్‌ను అవమానించినందుకు రాహుల్ గాంధీని దేశం ఎప్పటికీ క్షమించదు. ఆయన పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు. సావర్కర్ తన జీవితమంతా స్వాతంత్య్రం కోసం పోరాడారు. రాహుల్ మాత్రం తన సమయాన్ని.. బ్రిటీషర్ల సాయంతో భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకే కేటాయించారు' అని ఠాకూర్‌ విమర్శించారు. మరోవైపు.. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జంగిల్‌ రాజ్‌తిరిగి వచ్చిందని ఆరోపించారు. 'బీహార్‌లో శాంతిభద్రతలు దిగజారాయి. లాలూ హయాంలో ఉన్న జంగిల్‌ రాజ్.. మళ్లీ నితీశ్‌ కుమార్, తేజస్వీ యాదవ్‌ల హయాంలో తిరిగి రావడం దురదృష్టకరం' అని ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నిద్రపోతున్నారని విమర్శించారు. 'దీదీ నిద్రపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇలాగైతే ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏంటీ? అని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)