ఆంధ్రప్రదేశ్ లో 3 నుంచి ఒంటిపూట బడులు

Telugu Lo Computer
0


ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఎండలు ఎక్కువగా లేవని కారణంతో ఒంటి పూట బడులు పెట్టలేదని మంత్రి బొత్స తెలిపారు. అలాగే ఉదయం 7.45 నుంచి 12.30 వరకూ మాత్రమే బడులు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లూ ఈ మేరకు 3వ తేదీ నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు సిద్ధం కావాలని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ఈ ఉత్తర్వులను ధిక్కరించి బడులు నడిపితే చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో విద్యార్ధులకు ఒంటిపూట మాత్రమే స్కూళ్లు నడిపేలా అధికారుల్ని ఆదేశించామన్నారు. ఒంటిపూట బడులపై ప్రశ్నించిన టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన బొత్స, టీచర్లపై ఎలాంటి కోపం లేదన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ఈ పరీక్షలకు ఉదయం తొమ్మిదిన్నర దాటితే అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో విద్యార్ధుల్ని అనుమతించే అధికారం అధికారులకు ఇచ్చామన్నారు. 3344 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. 6 లక్షల 9 వేల 70 మంది ఈసారి పరీక్షలు రాస్తున్నారన్నారు.పదో తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోతే అధికారుల్ని సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)