వివాహితపై అత్యాచారం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కలిదిండిలో నివాసం ఉంటున్న వర్జగిరి ఏసు మరుగుదొడ్లు పనులు చేస్తుంటాడు. అతని భార్య, పిల్లలు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో మరుగుదొడ్లకు స్కిక్కర్లు అంటించడానికి సహాయకురాలిగా కొయ్యలగూడెంకు చెందిన ఓ వివాహితను కలిదిండి తీసుకువచ్చాడు. ఆమెకు వివాహం జరిగి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 11న ఏసు భార్య ఇంట్లో లేని సమయంలో తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. ఈ విషయమై పెద్దల పంచాయతీలో పరిష్కారం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మణికుమార్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)