రాహుల్‌ 'అనర్హత'పై దద్దరిల్లిన పార్లమెంట్‌ !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా పార్లమెంట్‌ లో ప్రతిపక్షాలు సోమవారం ఆందోళనలకు దిగాయి. రాహుల్‌పై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై విపక్ష సభ్యులు గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ప్రారంభమైన కేవలం నిమిషానికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖఢ్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా నేడు నల్లదుస్తుల్లో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో విపక్ష ఎంపీలు భేటీ అయి.. రాహుల్‌ 'అనర్హత'పై ప్రతిపక్షాల ఉమ్మడి వ్యూహం గురించి చర్చించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)