ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గెలుపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ  విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ కి కేవలం 19 ఓట్లు వున్నా , 23 ఓట్లు వచ్చాయి. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉండడంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి అంటే 22 ఓట్లు సరిపోతాయి. మరో నాలుగు ఓట్లు అదనంగా వచ్చాయి. అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు పడినా.. ఆమె ఓట్ల సంఖ్య 21కి చేరినట్టు. కానీ ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి రెండు ఓట్లు ఆమెకు పడ్డాయి. దీంతో వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరు ఎవరు అన్నది ఆసక్తి కరంగా మారింది. వైసీపీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టీడీపీ దే పై చేయి అయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)