మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం

Telugu Lo Computer
0


త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలో జరిగిన ఈ కార్యక్రమంలో  సాహాతో కలిసి 8 మంది మంత్రులు  ప్రమాణం  చేశారు.  ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి చీఫ్‌ జె.పి. నడ్డాలతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మలు హాజరయ్యారు. వీరితో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, సిక్కిం ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన బిజెపి మిత్రపక్షమైన ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి) నుండి సుక్లా చరణ్‌ నొటియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బిజెపి పాల్పడిన హింసాకాండకు నిరసనగా ప్రతిపక్ష సిపిఎం, కాంగ్రెస్‌లు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)