మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని వనీ బొగ్గు గని క్షేత్రంలో రైలు ఇంజిన్పై చిరుత కళేబరాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. దాంతో రైల్వే అధికారి రాజేశ్ సింగ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అటవీ అధికారులకు తెలియజేశారు. చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు పరీక్షల కోసం చంద్రపూర్ తరలించారు. రైలు ఇంజిన్ పైనుంచి దూకబోయిన చిరుత హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రైలు ఇంజిన్పై చిరుత కళేబరం !
March 08, 2023
0
Tags