ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన యువతికి రాజస్థాన్కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అప్పగింతలు అయిపోయాక వధూవరులిద్దరూ కలిసి అత్తారింటికి బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ వధువు ఒక్కసారిగా మనసు మార్చుకుంది. 'అత్తవారిల్లు చాలా దూరం, నాకు రాజస్థాన్ వెళ్లాలని లేదు. నేను వారణాసి వెళ్లిపోతా' అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారు ఆపాలంటూ గట్టిగా అరిచింది. దీంతో రోడ్డు పక్కన పెళ్లి వాహనాలు ఆగిపోయాయి. ఆదే సమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్ రెస్పాన్స్ వాహనంలోని సిబ్బంది మహరాజ్పుర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారిని వివరాలు అడిగారు. తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసి వెళ్తానని వధువు పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను మహిళా పోలీసు సహాయంతో అక్కడకు పంపించారు.
అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించిన వధువు !
March 19, 2023
0
Tags