తెలుగు రాష్ట్రాల మీదుగా బెంగళూరులోని యశ్వంతపుర నుంచి బీహార్లోని బరౌనీకి ప్రత్యేక రైలును నడపనున్నట్లు నైరుతి రైల్వే జోన్ ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు యశ్వంతపురం రైల్వేస్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైలు నెం 05216 మార్చి 21,28 తేదీలలోనూ, ఏప్రిల్ 4, 11 తేదీలలోనూ ఉదయం 7.30 గంటలకు బయల్దేరి వెళ్ళనుంది. ఈ రైలు ధర్మవరం. అనంతపురం, గుత్తి, దోన్, కర్నూల్, గద్వాల్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, కాచిగూడ, కాజీ పేట, రామగుండం, కాగజ్నగర్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలుగు రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులు ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రకటనలో కోరారు.
యశ్వంతపుర - బరౌనీ ప్రత్యేక రైలు !
March 18, 2023
0