కోడలిపై ఇటుకతో దాడి చేసిన మామ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌లో కాజల్, ప్రవీణ్ కుమార్ దంపతులు. ప్రవీణ్ చిరుద్యోగి. తాను కూడా ఏదో ఒక జాబ్ చేస్తానని కాజల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటోంది. భర్త సరేనన్నా మామకు గుర్రుగా ఉంటున్నాడు. జాబ్ చేస్తే ఇంటి పరువు పోతుందన్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇటుక రాయితో దాడి చేశాడు. ఆమె నెత్తిపై బాదాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. స్థానికులు ఆమెను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు 17 కుట్లుపడ్డాయి. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)