బోరు బావిలో పడి బాలుడు మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్ర రాష్ట్రం అహ్మద్ నగర్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం  బాలుడు పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రెస్క్యూ టీంను రప్పించి, 15 నుంచి 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించిన సహాయ బృందాలు.. రక్షించేందుకు బోరుకు సమాంతరంగా గొయ్యిని తవ్వారు. బాలుడిని కాపాడే క్రమంలో బావిలోకి ఆక్సిజన్ పంపిస్తూ మరోవైపు సహాయ చర్యలు కొనసాగించారు. మార్చి 14వ తేదీ మంగళవారం తెల్లవారుజామున బాలుడిని బయటకు తీసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఎనిమిది గంటల్లోనే ఆపరేషన్ పూర్తి చేసినా బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయాం అంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని స్పష్టం చేసింది. కొన్నాళ్ల క్రితం ఈ బోరు వేశారని.. నీళ్లు పడకపోవటంతో నిర్లక్ష్యంగా వదిలేసినట్లు  స్థానికులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)