నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేత !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సామూహిక అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని మహిళా పోలీసు బుల్‌డోజర్‌లను ఉపయోగించి కూల్చివేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్ న్యాయం కొనసాగుతోంది. మైనర్‌ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 260 కిలోమీటర్ల దూరంలోని దామోహ్‌లో చోటుచేసుకుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నాలుగో వ్యక్తి కౌశల్ కిషోర్ చౌబే పరారీలో ఉన్నాడు. ఆక్రమిత స్థలంలో కౌశల్ అక్రమంగా ఇల్లు కట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. అందుకే కౌశల్ ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేశారని పోలీసు అధికారులు తెలిపారు. మహిళా అధికారుల బృందం బుల్డోజర్‌ను ఆపరేట్ చేసి కామాంధుడు కౌశల్ ఇంటిని కూల్చివేసింది. మహిళా అధికారులు మంచి పని చేసారని, నిందితులకు బుద్ది చెప్పడానికి ఇలాంటి చర్యలు కొనసాగుతాయని రాణే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రషితా కుర్మి స్థానిక మీడియాకు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)