'మోడీ హటావో, దేశ్ బచావో' ర్యాలీ

Telugu Lo Computer
0


ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'మోడీ హఠావో, దేశ్ బచావో' ర్యాలీని గురువారం చేపట్టింది. అంతేకాక పోస్టర్లను కూడా ప్రచారాస్త్రంలో భాగంగా ఉపయోగించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపు మేరకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ కూడా హాజరయ్యారు. 'బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది' అని మాన్ తన ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజలంతా కేజ్రీవాల్‌ను ప్రేమిస్తారని పేర్కొన్నారు. మేము భగత్‌సింగ్ వారసులమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)