200 మంది ఉన్నా విమానం నాగపూర్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బంగ్లాదేశ్ లోని చిట్టాగాండ్ నుంచి ఒమన్ వెళ్తున్న విమానంలో బుధవారం అర్ధరాత్రి కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించి, మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయంలో దించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో విమానాన్ని అత్యతవసరంగా ల్యాండ్ చేశారు. కార్గో ఏరియాలో పొగలు వచ్చిన వెంటనే ప్రయాణికులను పైలట్ అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు. ఇటీవల విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలు జరుగుతున్నాయి. పైలట్కు గుండెపోటు రావడంతో 2021లో బైమన్ బంగ్లాకు చెందిన విమానం, అమెరికాలోని నెవార్క్ నుంచి 300 మంది ప్రయాణికులకు న్యూఢిల్లీకి వస్తున్న విమానం, ఫిబ్రవరి 27న కోల్ కతానుంచి బ్యాంకాక్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండ్ అయిన సంగతి విదితమే.
చిట్టాగాండ్ - ఒమన్ విమానం నాగపూర్ లో విమానం అత్యవసరంగా ల్యాండ్ !
March 02, 2023
0
Tags