పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా అహ్మద్పూర్, నాపరాలో చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. పెండు హెంబ్రం, పార్వతి హెంబ్రం బీర్భూమ్ జిల్లాలోని సైథియా థానా అహ్మద్ చౌకీ పరిధిలోని నాపరా గ్రామంలో నివస్తుండేవారు. మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో వృద్ధ దంపతులను దారుణంగా కొట్టారు. కొట్టడంతో తీవ్రంగా గాయపడిన దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులందరినీ సియురి కోర్టులో హాజరుపరచారు. అనంతరం వారిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించారు. నాపరా గ్రామానికి చెందిన మోరల్ రుబాయి బెస్రాతో సహా కొంతమంది స్థానిక ప్రజలు పెండు, అతని భార్య చేతబడి అభ్యసిస్తున్నారని అనుమానించారు. ఈ అనుమానంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను మోరల్ ఆధ్వర్యంలో కొట్టారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని నిన్న అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆరుగురి పేర్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఈరోజు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
చేతబడి నెపంతో వృద్ధ దంపతులపై దాడి !
March 27, 2023
0
Tags