రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ముగ్గురు మేనమామలు తమ మేనకోడళ్ల వివాహానికి కానుకగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు తాత, మేనమామలు రూ. 80 లక్షల నగదు, నగలు, ప్లాట్ పేపర్లు తీసుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. రాజస్థాన్ ఆచారం ప్రకారం వధువుకు వారి మేనమామలు భారీగా కానుకలు ఇచ్చుకున్నారు. దీన్ని చూసి వధువు కుటుంబీకులు షాక్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రిపోర్టర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ వీడియోకు లైకులు వెల్లువల్లా వస్తున్నాయి.
వధువుకు మేనమామల భారీగా పెళ్లి కానుకలు !
March 17, 2023
0
Tags