జెహ్‌కి నాటు నాటు పాట బాగా నచ్చింది !

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌  హోస్ట్‌ చేస్తున్న 'వాట్‌ ఉమెన్‌ వాంట్‌' నాలుగో  సీజన్‌  ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతోంది. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో కరీనా మాట్లాడుతూ ఆస్కార్‌ విన్నింగ్‌ నాటు నాటు పాట గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని, ఇది రెండేళ్ల పిల్లాడి మనసుని సైతం కొల్లగొట్టిందన్నారు. తన చిన్న కుమారుడు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినడం లేదని, అది కూడా తెలుగులో వినడానికే ఇష్టపడుతున్నాడని చెప్పింది. 'జెహ్‌కి నాటు నాటు పాట బాగా నచ్చింది. ఆ పాట వచ్చినప్పుడల్లా జెహ్‌ ఆనందంతో గత్తులు వేస్తున్నాడు. ఆ పాట పెడితే కానీ అన్నం తినడం లేదు. ఆస్కార్‌ గెలిచిన ఈ పాట ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఎంతటి మ్యాజిక్‌ క్రియేట్‌ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ' అంటూ కరీనా చెప్పుకొచ్చింది. కాగా కరీనా-సైఫ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు పేరు తైమూర్‌ కాగా చిన్న కుమారుడు పేరు జెహ్‌. 

Post a Comment

0Comments

Post a Comment (0)