టీటీడీ బడ్జెట్ నిధుల విడుదల

Telugu Lo Computer
0


2023-24 సంవత్సర ఆర్థిక సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బడ్జెట్టు 4,411 కోట్లుగా ఉంది. ఈ మేరకు బడ్జెట్ ను విడుదల చేసింది. గత నెల 17న టీటీడీ పాలక మండలి సమావేశంలో తితిదే బడ్జెట్ పై నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. లడ్డూ విక్రయశాలలో భక్తుల అవసరాల అనుగుణంగా రూ.5.25 కోట్లతో 30 అదనపు లడ్డూ కౌంటర్ల ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులోని ఉల్లందురు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులకు రూ.4.70 కోట్లు కేటాయించారు. తిరుపతిలోని ఎస్.జి.ఎస్ ఆర్ట్స్ కాలేజీలో మూడో అంతస్తు నిర్మాణానికి రూ.4.78 కోట్లు కేటాయింపునకు ఆమోదం. ఏప్రిల్ 5న ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కల్యాణానికి సిఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)