పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్‌పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. 'రైట్ టు పీ' పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నగరవ్యాప్తంగా మహిళల కోసం సురక్షితమైన, శుభ్రమైన టాయిలెట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 30, 2021న నాగ్‌పూర్ సిటిజన్స్ ఫోరం సంస్థ 'రైట్ టు పీ' అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి తరచూ టాయిలెట్ల కోసం ఉద్యమిస్తోంది. నగరంలో ఉచితంగా శుభ్రమైన, సురక్షితమైన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది. తాజా నిరసనల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను సంస్థ పరిశీలించింది. పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం వల్ల మహిళలు వేరే ప్రైవేటు టాయిలెట్లు వాడుకోవాల్సి వస్తోందని, ఇది మహిళలపై నేరాలు పెరగడానికి కారణమవుతోందని ఈ నిరసనల్లో పాల్గొన్న మహిళలు అంటున్నారు. ఈ నిరసనల్లో అనేక మంది యువతులు, మహిళా లాయర్లు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి కొందరు పురుషులు కూడా మద్దతు పలికారు.

Post a Comment

0Comments

Post a Comment (0)