గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతవాసి మహమ్మద్ ఇబ్రహీం 32 ఏళ్లుగా మంచానికే పరిమితమైన రజియా (85) తాజ్మహల్ను చూడాలన్న తన చిరకాల వాంఛను కుమారుడిగా తీర్చాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఇబ్రహీం దంపతులు సోమవారం ఆగ్రాకు తీసుకువచ్చారు. ఇందుకోసం దాదాపు 1,200 కిలోమీటర్లు రోజంతా ప్రయాణం చేశారు. తల్లిని స్ట్రెచర్పైనే తిప్పుతూ తాజ్మహల్ మొత్తం చూపించారు. నిస్తేజంగా పడున్న రజియా ఆ పాలరాతి నిర్మాణాన్ని చూసి ఓ చిరునవ్వు నవ్వారు. తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఇబ్రహీం దంపతులు మంచి పని చేశారని పలువురి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
తల్లి కోరిక తీర్చిన తనయుడు !
March 22, 2023
0
Tags