తెలంగాణలో ఏకకాలంలో 40 చోట్ల ఐటీ దాడులు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 15 March 2023

తెలంగాణలో ఏకకాలంలో 40 చోట్ల ఐటీ దాడులు


తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అల్వాల్, పటాన్ చెరువు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా హైదరాబాద్ లో ప్రతీ నెలలో ఎక్కడో ఓ చోట ఐటీ రైడ్స్ జరుగుతుండగా..తాజాగా మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులు పెద్ద ఎత్తున ఈ సోదాలు చేపట్టినట్టు సమాచారం. జంట నగరాల్లోని కీసర, ఘట్ కేసర్, మల్కాజ్ గిరి సహా 40 ప్రాంతాల్లో అధికారులు ఈ సోదాలు చేపట్టారు.  కాగా కొన్నిరోజుల క్రితం కూడా ఐటీ అధికారులు వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ రైడ్స్ చేపట్టారు. ఆ తరువాత దిల్ సుఖ్ నగర్ లోని గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మర దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి కంపెనీల్లో కూడా ఐటీ రైడ్స్ చేపట్టారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు.


No comments:

Post a Comment