పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, సెస్ వల్ల ప్రజల నుంచి గత ఆరేళ్లలో రూ.36,66,174 కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23 (ఏప్రిల్-డిసెంబర్) వరకు రూ.5,45,002 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గత ఆరేళ్లలో రూ.36,66,174 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
పెట్రో సెస్, ఎక్సైజ్ డ్యూటీగా రూ.36,66,174 కోట్లు వసూలు
March 14, 2023
0
Tags