దేశంలో కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 29 March 2023

దేశంలో కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదు


దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు క్రమంగా భారీగా పెరుగుతుండటం ఆందోళనగా  మారింది. గత ఐదు నెలలుగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం ఇదే మళ్లీ తొలిసారి అని కేంద్రం పేర్కొంది. గత అక్టోబర్ నుండి ఇంత భారీగా కేసులు నమోదైన దాఖలాలు లేవు. ఇప్పటివరకు దేశంలో 11,903 క్రియాశీలక కరోనా కేసులు ఉన్నట్టు సమాచారం. కాగా కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఒకరు, మహారాష్ట్ర , కేరళలో ముగ్గురు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక డేటా వెల్లడిస్తుంది. ప్రస్తుతం నమోదైన కేసులను బట్టి కరోనా రోజువారి రికవరీ రేటు 1.51 శాతంగా ఉన్నట్టు సమాచారం. వారం రికవరీ రేటు 1. 53% గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

No comments:

Post a Comment