గుజరాత్లోని మోర్బి జిల్లాలో అమ్రన్ గ్రామంలో 56 ఏండ్ల మహేష్ గొసాయి కిరాణా దుకాణం నడుపుతుంటాడు. ఫిబ్రవరి 2022లో ఓ వితంతువుతో ఇన్స్టాగ్రాం వేదికలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో త్వరలో తాను లండన్లో స్ధిరపడేందుకు వెళుతున్నానని, సదరు మహిళను కూడా పెండ్లి చేసుకొని లండన్ తీసుకొని పోతానని మాయ మాటలు చెప్పాడు. వీసా ఫీజు, ఇతర ఖర్చుల కోసం మహిళ దగ్గర విడుతల వారీగా 12 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. చివరకు తాపే మోసపోయినట్లు గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితుడు గొసాయిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి పేరుతో మహిళకు 12 లక్షల టోకరా !
March 21, 2023
0
Tags