ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ నగారాన్ని ధారాశివ్‌గా పేర్లు మారుస్తూ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాజాగా, కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలను ఆయన పంచుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చిందని వ్యాఖ్యానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)