సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టుకు ఇవాళ కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. దీంతో సుప్రీంలో జడ్జీల సంఖ్య 34కు చేరుకున్నది. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ రాజేశ్ బిందాల్‌, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్‌లకు పదోన్నతి కల్పించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఇద్దరు కొత్త జడ్జీలను నియమించినట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆ ఇద్దరు పేర్లను సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం అయిదుగురు జడ్జీలను సుప్రీంకు నియమించిన విషయం తెలిసిందే. సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించిన రెండు నెలల తర్వాత సుప్రీం జడ్జీల నియామకం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)