ఈసీ ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 February 2023

ఈసీ ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ


శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్‌ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్‌ పిటిషన్ విచారణకు స్వీకరించింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం కోర్టును కోరింది. ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునే వరకు యధాస్థితిని కొనసాగించాలని ఉద్ధవ్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. తమకు రక్షణ కావాలని, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేదన్నారు. శివసేన పార్లమెంటరీ కార్యాలయాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండువారాలు వాయిదా వేసింది.

No comments:

Post a Comment