శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్ ‭పోర్ట్‭ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎయిర్ ‭పోర్ట్ మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కలల ప్రాజెక్ట్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎయిర్ ‭పోర్ట్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. శివమొగ్గ ఎయిర్‭ పోర్ట్ నిర్మాణానికి ఉడాన్  పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎయిర్ ‭పోర్ట్‭ కు కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కువెంపు పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికులను చేరవేస్తుంది. శివమొగ్గ విమానాశ్రయాన్ని దాదాపు రూ. 449 కోట్లతో నిర్మించారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం రోజుకు 7,200 మంది ప్రయాణీకులను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. దీనితో కర్ణాటకలో తొమ్మిది ఎయిర్ ‭పోర్ట్ ‭లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‭పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఈ ఎయిర్‭ పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతి పెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే. మరో విశేషం ఏంటంటే, యడియూరప్ప పుట్టినరోజు అయిన ఈరోజే ఈ ఎయిర్ ‭పోర్ట్‭ ను ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)