గాడిదలకు సీమంతాలు !

Telugu Lo Computer
0

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో గర్భందాల్చిన గాడిదలకు సీమంతాలు చేస్తున్నారు. వాటి పిల్లలకు బారసాలలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత వాసులు ఇలా చేయడానికి ప్రధాన కారణం హలరీ అనే గాడిద జాతి అంతరించి పోయే పరిస్థితులు నెలకొనివున్న తరుణంలో ఈ జాతి గాడిదలను కాపాడేందుకు ఆ ప్రాంత ప్రజలు వింతగా సీమంతాలు చేస్తున్నారు. ఈ జాతి గాడిదల సంఖ్యను పెంచేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అందుకే ఈ జాతి గాడిదలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పైగా ఆ గాడిదలకు పుట్టే పిల్లలకు బారసాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.  కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకాలోని కోల్కి అనే గ్రామంలో హరరీ జాతి గాడది ఈనింది. దీంతో ఆ గ్రామ వాసులు సంబరాలు చేసుకున్నారు. పశువులు కాపరులు, ఇతరులు కలిసి బారసాల చేశారు. గర్భందాల్చిన మరో 33 గాడిదలకు కూడా సీమంతం చేశారు. నుదిటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజ చేసి, ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాలా కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)