దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సోమవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించి 'ఆర్ఆర్ఆర్' ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన 'కాంతారా' లో నటనకు గానూ రిషబ్శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమనటిగా అలియాభట్ (గంగూబాయి కాఠియావాడి) చిత్రాలకు పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'ది కశ్మీర్ఫైల్స్' అవార్డు దక్కించుకుంది. చిత్రీకరణలో బిజీగా ఉండి రణ్బీర్ హాజరుకాలేకపోవడంతో ఆయన సతీమణి, నటి అలియా భట్ ఉత్తమనటుడి అవార్డు అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలందించినందుకుగానూ 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును రేఖ (Rekha) అందుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన తారలు స్టైలిష్ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకున్నారు. వరుణ్ ధావన్, రోనిత్ రాయ్, శ్రేయా తల్పాడే, ఆర్.బాల్కి, షాహిల్ ఖాన్, నటాలియా, జయంతిలాల్ గడ, సాచిత్, పరంపర, వివేక్ అగ్నిహోత్రి, రిషబ్ శెట్టి, హరిహరన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్, ఉత్తమ దర్శకుడు: ఆర్.బాల్కి (చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్), ఉత్తమ నటుడు: రణ్బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్శెట్టి (కాంతారా), క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్: వరుణ్ ధావన్ (బేడియా), మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్, క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్ (జల్సా), ఉత్తమ సహాయ నటుడు: మనీష్ పాల్ (జగ్ జగ్ జీయో), ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: ఆర్ఆర్ఆర్.
No comments:
Post a Comment