భార్యా బాధితుల నిరాహార దీక్ష

Telugu Lo Computer
0


బెంగళూరులో 'సేవ్‌ ఇండియన్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌'తో కలిసి భార్యా బాధితుల సంఘం ప్రతినిధులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని సంఘం సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న భర్త తరఫు కుటుంబసభ్యులను వేధిస్తున్నారని సంఘ సభ్యులు వాపోయారు. ఎన్‌ఆర్‌ఐల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటుచేయాలని కోరారు. గృహహింస చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)