ఆసుపత్రిలో చేరిన శిబు సోరెన్

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ ముక్తి మోర్చా అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మేదాంత హాస్పిటల్ సూపరింటెండెంట్ అజీత్ సింగ్ తెలిపారు. 79 ఏళ్ల శిబు సోరెన్ 2005 , 2010 మధ్య మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)