కన్నీటి పర్యంతమైన అశ్వినీ చౌబే !

Telugu Lo Computer
0


భారతీయ జనతాపార్టీ కిసాన్‌ మోర్చా నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పరుశురామ్ చతుర్వేది. బీహార్‌లోని బక్సర్‌లో సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ వార్త విన్న కేంద్రమంత్రి అశ్వినీ చౌబే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'వణికించే చలిలో గత మూడు రోజులుగా రైతు సమస్యలపై జరుపుతోన్న నిరాహారదీక్షలో నాతో పాటు పరుశురామ్ పాల్గొన్నారు. ఆయన అకాల మరణం గురించి ఇప్పుడే తెలిసింది' అంటూ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం గత 24 గంటల వ్యవధిలో బక్సర్‌లో తనపై రెండుసార్లు దాడికి యత్నాలు జరిగాయని ఆరోపించారు. 'రైతు సమస్యలపై బక్సర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దుండగులు నాపై దాడికి యత్నించారు. కర్రలు ఊపుతూ మీదికి వచ్చారు. కానీ వెంటనే స్పందించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది వారిని అడ్డుకోపోతే.. నా పరిస్థితి ఎలా ఉండేదో..? అంతకు ముందు ఇలాంటి యత్నమే జరిగింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు నేను ఫిర్యాదు చేశాను. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదు. అలాగే అదుపులోకి తీసుకున్న ముగ్గురిని కూడా వదిలేశారు' అంటూ నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)