అలీగఢ్ లో రాళ్లతో ఇరువర్గాలు దాడులు

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ లో సోమవారం రాత్రి కొంత మంది యువకులు చికెన్ షాప్ కి వెళ్లారు. ఆ సమయంలో చికెన్ షాప్ యజమానికి యువకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ పెద్దది మారి పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తమ బలగాలతో అక్కడికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి గొడవను సర్ధుమణిగేలా చూశారు. చికెన్ యజమానితో యువకులకు చిన్న విషయంపై గొడవ జరిగిందని, విచక్షణ కోల్పోయి ఇరు వర్గాలు గొడవకు దిగడంతో పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయని వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని, అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని డీఐజీ దీపక్ కుమార్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)