గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ట్రావెల్ సేల్‌ !

Telugu Lo Computer
0


గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ తాజాగా ట్రావెల్ ఇండియా ట్రావెల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 16 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే విమాన టికెట్లు పొందొచ్చు. కంపెనీ అందిస్తున్న ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ జనవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది.  గో ఫస్ట్ ఎయిర్‌లైన్ ఆఫర్ ప్రకారం చూస్తే విమాన టికెట్ ధర రూ. 1,199 నుంచి ప్రారంభం అవుతోంది. దేశీ విమాన ప్రయాణానికి ఇది వర్తిస్తుంది. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టికెట్ ధర అయితే రూ. 6599 నుంచి స్టార్ట్ అవుతోంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులకు ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు ఉంటుంది. ఇంకా లిమిటెడ్ సీట్లకు ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్‌లో భాగంగా 10 లక్షలకు పైగా సీట్లను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కంపెనీ విమాన ప్రయాణికులకు అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తోంది. రీషెడ్యూలింగ్, క్యాన్సలేషన్ వంటివి ఉచితంగా పొందొచ్చు. దీని వల్ల ప్రయాణికులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. 'మీ బ్యాగ్స్‌ను ప్యాక్ చేసుకోండి. తక్కువ ధరకే విమాన టికెట్లు అందుబాటులో ఉంచాం. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్‌ను రూ. 1199 ప్రారంభ ధరతో పొందండి. ఇంటర్నేషన్ ప్రయాణ చార్జీలు రూ. 6599 నుంచి స్టార్ట్ అవుతున్నాయి' అని కంపెనీ ట్వీట్ చేసింది. గత వారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. బెంగళూరులో దాదాపు 55 మంది ప్రయాణికులను అలాగే వదిలేసి ఫ్లైట్ వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే గో ఫస్ట్ ఎయిర్‌లైన్ డీజీసీఏ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌కు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే డీజీసీఏ స్పందించి నోటీసులు పంపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)