కర్ణాటకలోని హుబ్లీ- ధార్వాడ్ జంటనగరాల్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 12న యువజనోత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపటి నుండి జరిగే యువజనోత్సవాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. 12 నుంచి 16వరకు కొనసాగనుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. ఇక ఈ ఫెస్టివల్కి దేశవ్యాప్తంగా 30వేలమంది యువత రానున్నారని, అందులో 7,500 మంది యూత్ యాక్టివ్ రోల్ పోషించనున్నారని అనురాగ్ తెలిపారు. ఇక ఈ ఫెస్టివల్లో.. మల్కం, యోగాసనం, కలరేపట్టు, థంగ్టా, గట్కా వంటి భారతీయ సంప్రదాయ క్రీడలు ప్రదర్శితమౌతాయని మంత్రి వెల్లడించారు. ఈ ఫెస్టివల్ ద్వారా సాంప్రదాయ క్రీడల గురించి ప్రజలు తెలుసుకుని.. ఈ ఆటలను భవిష్యత్తులో దేశ, అంతర్జాతీయ క్రీడలుగా తీర్చిదిద్దే అవకాశముందని ఆయన అన్నారు.
రేపటి నుండి యువజనోత్సవాలు ప్రారంభం
January 11, 2023
0
Tags