వీరసింహా రెడ్డి చిత్రంలో దేవ బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికిగాను క్షమాపణలు చెప్పారు. రావణబ్రహ్మను దేవ బ్రాహ్మణులకు మూల పురుషుడిగా అభివర్ణించారాయన. దీనిపై ఆ సామాజిక వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. వారికి క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేశారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ తనకు అందిన సమాచారం తప్పు అని పేర్కొన్నారు. ఆ సమాచారం మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు. దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బాలకృష్ణ తెలిపారు. తాను చెప్పిన మాటల వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదని, దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో వచ్చిన మాట మాత్రమేనని, అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అని వివరణ ఇచ్చారు.
క్షమాపణ చెప్పిన బాలయ్య !
January 15, 2023
0
Tags