ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో మహేశ్ పూజారి అనే వ్యక్తి గత 25 ఏళ్ల నుంచి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య ఆ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆ మహిళ ఆ వ్యక్తిని కోరింది. గడిచిన రెండు రోజుల నుంచి ఇళ్లు వదిలి వెళ్లిన అతను శుక్రవారం ఇంటికి వచ్చి ఆ మహిళపై యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆ మహిళకు 40 శాతం శరీరం కాలిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ముంబైలోని ఎల్టీ మార్గ్ పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై యాసిడ్ దాడి !
January 14, 2023
0