శంకర్‌ మిశ్రా ఆరోపణలన్నీ కల్పితమే !

Telugu Lo Computer
0


ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా కోర్టులో తన వాదనను మార్చేయడంపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, బహుశా ఆ మహిళే మూత్రవిసర్జన చేసుకుని ఉంటుందని నిందితుడు శంకర్‌ మిశ్రా నిన్న కోర్టుకు వెల్లడించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా బాధితురాలు స్పందించారు. ''నిందితుడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆ వ్యక్తి తన బెయిల్‌ దరఖాస్తులో పేర్కొన్న విషయాలు, కోర్టులో చేసిన వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నేను అనుభవించిన ఇలాంటి భయానక అనుభవం మరొకరికి ఎదురవ్వకుండా సంస్థాగత మార్పులు చేపడతారనే ఉద్దేశంతోనే నేను ఈ ఫిర్యాదు చేశాను. ఆ వ్యక్తి తన అసహ్యకరమైన చర్యకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి, బాధితురాలిని మరింత వేధించాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు'' అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)