తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ ఈనెల 19 న తెలంగాణ రావాల్సి ఉంది. కొన్ని మార్పుల కారణంగా ఆయన పర్యటనను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ వందే భారత్ ట్రెయిన్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కేంద్రం చెప్పింది. వందే భారత్ రైలు.. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్య నడవనుంది. ట్రెయిన్ ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు అవ్వాలి. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి మోడీని ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట !. మహబూబ్ నగర్ నుంచి మోడీని దించి అక్కడ గెలిపించుకొని తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వాటినే రాష్ట్రమంతా మార్చుకొని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోంది.
మోడీ పర్యటన వాయిదా
January 12, 2023
0
Tags