బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం !

Telugu Lo Computer
0


బెంగళూరులో ఇంట్రాసిటీ హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం, హోసూరు ఏరోడ్రోమ్ ను కలుపుతూ ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్లై బ్లేడ్ ఇండియా, హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థలు జాయింట్ వెంచర్ గా ఈ సేవలను ప్రారంభించాయి. హెలికాప్టర్ సర్వీసుల కోసం ఒక్కొక్కరికి రూ. 6 వేల చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు.హోసూరు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గంలో చేరుకునేందుకు 3 గంటల సమయం పడుతుంది. హెలికాప్టర్ ద్వారా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బుధవారం నుంచి బ్లేడ్ ఇండియా వెబ్ సైట్ లో హెలికాప్టర్ సర్వీసుల బుకింగ్స్ ప్రారంభించారు. 2019లో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించిన బ్లేడ్ ఇండియా.. మహారాష్ట్రలోని ముంబై, పూణె, షిర్డీల మధ్య సేవలు అందిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)