నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్మూ కశ్మీర్లోని కుప్వారా సెక్టార్లో పర్యటించారు. నియంత్రణ రేఖ వెంబడి వివిధ ఎత్తైన ప్రదేశాల్లో మోహరించిన దళాలను సందర్శించారు. వారితో సరదాగా మాట్లాడుతూ బాగోగులు తెలుసుకున్నారు. వారిలో స్ఫూర్తి నింపారు. సైనికులు, వారి కుటుంబాలకు మనోజ్పాండే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సైనికులు, జాగిలాల నుంచి సైనిక వందనం స్వీకరించిన ఆయన వారిలో స్ఫూర్తి నింపారు. సరిహద్దు భద్రతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సైనికులంతా ఆయనతో ఫొటోలు తీసుకున్నారు.
కుప్వారాలో జనరల్ మనోజ్పాండే
January 01, 2023
0
Tags