ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులకు మధ్యంతర బెయిల్

Telugu Lo Computer
0


ఢిల్లీ మద్యం కేసులో నిందితులైన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ కు సీబీఐ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.   ఇందులో ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, మొత్తం ఏడుగురి నిందితులపై సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు బెయిల్ జారీ చేసింది. ఈ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి, విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా మిగతా వారిని మాత్రం అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కోర్టు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్ళై, సమీర్ లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా రెగ్యులర్ బెయిల్ కోసం మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)