సంపర్క్ క్రాంతి ఇక అక్షరధామ్ ఎక్స్ ప్రెస్

Telugu Lo Computer
0


అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ ప్రెస్ గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవో వెల్లడించారు. స్వామినారాయణ్ సంస్థ అధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహరాజ్ కు నివాళిలర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు ఢిల్లీ, అహ్మదాబాద్ లోని అక్షరధామ్ దేవాలయాలను కలుపుతుందని తెలిపారు. స్వామినారాయణ సంస్థ చేస్తోన్న సేవలకుగానూ ఇది చిరు కానుకని పేర్కొన్నారు. 2005లో మార్చి నెలలో అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య తొలి సర్వీస్ ప్రారంభం అయింది. ఈ రైలు గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)