భర్తను చంపి శవంపై సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించిన ఘనురాలు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కి చెందిన సతీష్‌, నీతూ దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. సతీష్ తన భార్య, కొడుకుతో గ్రేటర్ నోయిడాకి వచ్చాడు. సరస్వతి కుంజ్‌ లో ఇంటిని నిర్మించుకోవాలని భావించాడు. ఆ ఇంటి నిర్మాణ పనులను హర్పాల్ అనే తాపీ మేస్త్రీకి అప్పగించాడు. సతీష్ భార్య నీతూ, హర్పాల్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సతీష్ ఇంట్లో లేని సమయంలో మేస్త్రీతో నీతూ రాసలీలలు కొనసాగించింది. అయితే, ఈ విషయం భర్తకు తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని ఆమె భయపడింది. తన ప్రియుడితో సుఖంగా ఉండాలని భావించి భర్తను చంపాలని  నిర్ణయించుకుంది. భర్త అడ్డు తొలగించుకున్నాక ప్రియుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం అతడితో సుఖంగా ఉండాలని భావించింది. భర్తను చంపాలని డిసైడ్ అయిన నీతూ ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. పథకం ప్రకారం జనవరి 2న తన ప్రియుడితో కలిసి ఒక డ్రింక్‌లో మత్తు మందు కలిపి భర్తతో తాగించింది. అది తాగిన సతీష్ స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత  ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపేసింది భార్య నీతూ. ఎవరికీ ఎలా అనుమానం రాకుండా మృత దేహాన్ని పొరుగున నిర్మాణంలో ఉన్న ఇంటికి తరలించింది. అక్కడ శవాన్ని పాతిపెట్టింది. దాని పైనే ఆ మేస్త్రీ సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించాడు. ఇక, తాము చేసిన నేరం ఎప్పటికీ బయటపడదని వారు భావించారు. కాగా, సతీష్ కనిపించకుండా పోవడంతో అతని సోదరుడు జనవరి 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. భార్య నీతూపై వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. తమదైన స్టైల్ లో ఆమెను ప్రశ్నించారు. దీంతో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. వివాహేతర బంధం మోజులో ప్రియుడితో కలిసి తన భర్తను భార్య నీతూనే మర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో నీతూ నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ నుంచి వెలికితీసి, దర్యాప్తు జరుపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)