జనవరి 7వ తేదీ రాత్రి అంధేరీ-కుర్లా రోడ్డులోని రెస్టారెంట్ మూసివేసిన తర్వాత వచ్చి ఆహారం అడిగిన కస్టమర్లను రెస్టారెంట్ సిబ్బంది చితకొట్టారు. ముగ్గురు వ్యక్తులను కొట్టినందుకు నలుగురు వెయిటర్లను అరెస్టు చేసినట్లు ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి బాధితుడిని వెతికి పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు వ్యక్తులపై వెదురు కర్రలతో దాడి చేశారు. రెస్టారెంట్ యజమాని బాధితులను తిట్టడమే కాకుండా, కొట్టమని వెయిటర్లను కోరాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324, ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
కస్టమర్లపై రెస్టారెంట్ సిబ్బంది దాడి !
January 11, 2023
0
Tags