పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం తూమ్‌పల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు సిరికొండ మండలం తూమ్‌పల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లారు. వేట నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు తపంచా పేలడంతో రావోజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)