కర్ణాటకలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.2,000 సాయంగా అందించనున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్.అశోక చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రకటిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు సీఎం బసవరాజ్ బొమ్మై వివరిస్తారన్నారు. ఈ ఏడాది జులై నుంచే పథకం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉండే మహిళకు ప్రతినెల రూ.2,000ల చొప్పున సంవత్సరానికి రూ.24,000 ఇస్తామని చెప్పారు. ఆ మరునాడే అధికార పార్టీ మంత్రి పేదలకు రూ.2,000 పథకం ప్రకటించడం గమనార్హం. 75 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. కర్ణాటకలో మరోమారు తామే అధికారంలోకి వస్తామని మంత్రి అశోక ధీమా వ్యక్తం చేశారు.
Post Top Ad
adg
Thursday, 19 January 2023
Home
karnataka
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని
ప్రతి పేద కుటుంబానికి నెలకు రెండు వేలు సాయం
ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు
రెవెన్యూ మంత్రి ఆర్.అశోక
ప్రతి పేద కుటుంబానికి నెలకు రెండు వేలు సాయం !
ప్రతి పేద కుటుంబానికి నెలకు రెండు వేలు సాయం !
Tags
# karnataka
# దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని
# ప్రతి పేద కుటుంబానికి నెలకు రెండు వేలు సాయం
# ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు
# రెవెన్యూ మంత్రి ఆర్.అశోక
About Telugu Post
రెవెన్యూ మంత్రి ఆర్.అశోక
Tags
karnataka,
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని,
ప్రతి పేద కుటుంబానికి నెలకు రెండు వేలు సాయం,
ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు,
రెవెన్యూ మంత్రి ఆర్.అశోక
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment